కోల్కతా: ఎవరైనా అల్లర్లు చేయడాని వస్తే, మీరంతా నిశబ్ధంగా ఉండాలని, వాళ్లకు మీరు ఎర కావద్దు అని, మీ తలలను కూల్గా ఉంచుకోవాలని, ఒకవేళ ఎక్కడైనా పేలుడు జరిగితే, అక్కడ అరెస్టులు చేసేందుకు బీజేపీ ఎన్ఐఏను పంపుతోందని, అందర్నీ అరెస్టు చేస్తే, దేశం నిర్జనంగా మారుతుందని, అందరు కలిసి ఒక్కటిగా ఉండే అద్భుతమైన ఆకాశం కావాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) అన్నారు. ఈద్ వేడుక సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈద్ ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు. మనం అందరం కలిసి జీవిస్తే, మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, యూనిఫామ్ సివిల్ కోడ్లను తాము అంగీకరించబోము అని దీదీ తెలిపారు.
#WATCH | Kolkata: West Bengal Chief Minister Mamata Banerjee says, “…If anyone comes to riot, you should keep quiet, keep your head cool…If there is a blast, they (BJP) send NIA to arrest everyone. By arresting everyone, your country will become desolate…We want a beautiful… pic.twitter.com/bVeUqfxjRr
— ANI (@ANI) April 11, 2024