న్యూఢిల్లీ: విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనకు సంబంధించి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఆదివారం ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు. వాంతులు చేసుకోవటమేగాక, టాయ్లెట్ బయటే మల, మూత్ర విసర్జన చేయటంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బంది పడ్డారు. పడుతూ లేస్తూ ఆ ప్రయాణికుడు వ్యవహరించిన తీరుతో సీట్ల మధ్య నడిచే మార్గమంతా అపరిశుభ్రంగా మారింది. విమానంలో ఎయిర్ హోస్టెస్ వెంటనే స్పందించి అక్కడంతా శుభ్రం చేయాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సదరు ప్రయాణికుడిపై ఇండిగో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నది తెలియరాలేదు.