పాట్నా: రైలు ఆలస్యంపై ఒక ప్రయాణికుడు ఆగ్రహం చెందాడు. మద్యం మత్తులో ఉన్న అతడు లోకో పైలట్తో గొడవ పడ్డాడు. ఆపై ట్రైన్ డ్రైవర్ తలపై రాయితో కొట్టాడు. (Drunk Passenger Hits Loco Pilot) దీంతో లోకో పైలట్ తలకు గాయం కావడంతో రక్తం కారింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 17న బుధవారం సమస్తిపూర్-కతిహార్ ప్యాసింజర్ రైలు అరగంట ఆలస్యంగా నడిచింది. దీంతో కర్హగోలా రైల్వే స్టేషన్కు ఆలస్యంగా చేరుకుంది.
కాగా, కర్హగోలాకు చెందిన సుశీల్ కుమార్ ఆ రైలు ఎక్కేందుకు రైల్వే స్టేషన్లో వేచి ఉన్నాడు. రైలు ఆలస్యంగా రావడంపై అతడు ఆగ్రహించాడు. మద్యం మత్తులో ఉన్న సుశీల్ రైలు ఇంజిన్ వద్దకు వెళ్లాడు. రైలు ఎందుకు ఆలస్యమైందంటూ లోకో పైలట్ ప్రభాస్ చంద్ చౌరాసితో గొడవ పడ్డాడు. డ్రైవర్ క్యాబిన్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. లోకో పైలట్ ప్రభాస్ను తిట్టడంతోపాటు రాయితో అతడి తలపై కొట్టాడు. దీంతో తలకు గాయం కావడంతో రక్తం ధారగా కారింది.
మరోవైపు ఆ స్టేషన్లోని మిగతా ప్రయాణికులు వెంటనే సుశీల్ కుమార్ను చుట్టుముట్టారు. అతడ్ని స్టేషన్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లగా రైల్వే పోలీసులకు అప్పగించారు. గాయపడిన లోకోపైలట్ ప్రభాస్కు చికిత్స అందించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ రైలు ఆలస్యంగా ఆ స్టేషన్ నుంచి కదిలింది. కాగా, కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ट्रेन लेट हुई तो फोड़ दिया रेल ड्राइवर का सिर, गाली दिया और कर दिया लहूलुहान
बिहार के कटिहार काढ़ागोला रोड रेलवे स्टेशन पर ट्रेन लेट होने पर एक यात्री ने रेल ड्राइवर का सिर फोड़ दिया और उसे गालियां दी। ट्रेन ड्राइवर के सिर में टांके लगे हैं। आरोपी को हिरासत में लिया गया है।… pic.twitter.com/TYse50cb4a— FirstBiharJharkhand (@firstbiharnews) January 20, 2024