Noida | ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును ముగ్గురు చిన్నారులపైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 45లోగల సదాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఘనటకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ముగ్గురు అక్కచెల్లెల్లు రియా, అను, అంకిత పానీపూరీ తినేందుకు వెళ్లారు. రోడ్డు పక్కన ఉన్న బండి వద్ద గోల్గప్పా తింటుండగా.. ఆ సమయంలో ఓ వ్యక్తి ఫుల్గా మద్యం సేవించి వేగంగా కారు నడుపుతూ వచ్చాడు. ఈ క్రమంలో అదుపుతప్పి ముగ్గురు చిన్నారులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రియా (6) మంగళవారం ఉదయం మృతి చెందినట్లు పోలీసు అధికారి రాజీవ్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.