President Murmu | భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము కొలువుదీరనున్నారు. గురువారం పార్లమెంట్ హౌస్లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము విజయం సాధించారు. దీంతో దేశ 15వ రాష్ట్రపతిగా ఆమె బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధమైంది. గురువారం పార్లమెంట్ భవన్లో రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ మొదలైంది.
ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము 2824 తొలి ప్రాధాన్య ఓట్లు (6,76,803 విలువైన ఓట్లు) పొందారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ శర్మకు తొలి ప్రాధాన్య ఓట్లు 1,877 ఓట్లు (3,80,177 విలువైన ఓట్లు) లభించాయని రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు. దీంతో ద్రౌపది ముర్ము దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని ప్రకటించారు.
కాగా, రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్మును దేశ ప్రధాని నరేంద్రమోదీ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. తొలి గిరిజన రాష్ట్రపతి కానున్నారు. ఈ నెల 25న నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయిస్తారు. 17 మంది ఎంపీలు ముర్ముకు క్రాస్ ఓటింగ్ వేశారు.