న్యూఢిల్లీ : టీ బ్రేక్ కోసం డ్రైవర్ ఏకంగా నడిరోడ్డుపై బస్ను ఆపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ బాధ్యతారాహిత్యంపై నెటిజన్లు ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. శుభ్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. 25 సెకండ్ల నిడివి కలిగిన ఈ క్లిప్లో డ్రైవర్ టీ తాగడం కోసం డీటీసీ బస్ను నడిరోడ్డుపై పార్క్ చేయడం కనిపించింది.
men😭☕ pic.twitter.com/EDOSmxlnZC
— Shubh (@kadaipaneeeer) January 2, 2023
ఆపై తనకిష్టమైన ఛాయ్ సేవించిన డ్రైవర్ తాపీగా రోడ్డు దాటి అటువైపున పార్క్ చేసిన బస్లోకి వెళుతుండటం వీడియోలో చూడొచ్చు. టీ తాగడం కోసం డ్రైవర్ చేసిన పనితో ఆ మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ పోస్ట్కు మెన్ అని క్యాప్షన్గా ఇచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 58,000కుపైగా వ్యూస్ లభించాయి.
డ్రైవర్ నిర్వాకంపై కొందరు జోక్లు పేల్చగా పలువురు యూజర్లు అతడి ప్రవర్తనపై మండిపడ్డారు. నడిరోడ్డుపై బస్ను నిలిపి వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పరచినందుకు డ్రైవర్ను సస్పెండ్ చేయాలని మరికొందరు యూజర్లు కామెంట్ చేశారు. అతడి ప్రాధాన్యతలు అలా ఉన్నాయని మరో యూజర్ సెటైర్ వేశారు.