న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రక ఘట్టం నమోదైంది. భారత అతిపెద్ద ప్రైవేట్ ఉపగ్రహం ‘మిషన్ దృష్టి’ రోదసి ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ‘స్పేస్ ఎక్స్’కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఆప్టోసార్’ శాటిలైట్ ఇది.
అంటే సాధారణ కెమెరా (ఆప్టికల్), రాడార్ (సింథటిక్ అపర్చర్ రాడార్) టెక్నాలజీని కలిపి తయారుచేసిన హైబ్రిడ్ శాటిలైట్. భూమిపై మబ్బులు సహా ఎలాంటి వాతావరణం ఉన్నా.. అంతరిక్షం నుంచి హై-రిజల్యూషన్ చిత్రాలు తీయటం దీని ప్రత్యేకత. దీనిని రక్షణ, విపత్తు నిర్వహణ, వ్యవసాయం, మౌలిక సదుపాయాల పర్యవేక్షణకు భారత్ ఉపయోగించనున్నది.