ముంబై: విమానాశ్రయాల్లో తనిఖీలు అత్యంత పకడ్బందీగా ఉంటాయి. ప్రయాణికుల లగేజీ కూడా పరిమితికి కొన్ని గ్రాములు ఎక్కువ ఉన్నా అనుమతించరు. అయినా స్మగ్లర్లు ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఏదో ఒక దారిలో అక్రమంగా మాదకద్రవ్యాలు, బంగారం తరలిస్తూనే ఉన్నారు.
తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలోని విమానాశ్రయంలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు 8 కిలోలు డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.40 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.