నాగ్పూర్, జనవరి 6: ఎలుకలను ఇంటెలిజెన్స్ నిఘా కోసం ఉపయోగించుకునే అత్యాధునిక సాంకేతికతను డీఆర్డీవోలోని యంగ్ సైంటిస్ట్ ల్యాబోరేటరీ అభివృద్ధి చేస్తున్నది. ఈ ఎలుకలను ‘ర్యాట్ సైబర్గ్స్’ అంటారు. వీటి తలపై కెమెరాతో పాటు పలు పరికరాలను బిగిస్తారు. సెమీ ఇన్వేసివ్ బ్రెయిన్ ఎలక్ట్రోడ్ల ద్వారా ఈ ఎలుకలను నియంత్రిస్తారు. వాటి ద్వారా అవసరమైన సమాచారం సేకరించగలుగుతారు. ఇలాంటి సాంకేతికతను మన దేశం అభివృద్ధి చేయడం ఇదే మొదటిసారి. పలు దేశాల్లో ఇప్పటికే ఇది అందుబాటులో ఉంది. ఇంటెలిజెన్స్ నిఘా కోసం భద్రతా దళాలకు ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిఘాకు రిమోట్ కంట్రోల్తో పని చేసే రోబోలను కూడా ఉపయోగించుకుంటారు. కానీ, ఈ రోబోలు గోడలు ఎక్కడం, ఇరుకైన ప్రాంతాల్లోకి వెళ్లడం కష్టం. ఈ ఎలుకలు మాత్రం ఇలాంటివి చేయగలవు.