న్యూఢిల్లీ: రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) గురువారం నిర్వహించిన ఇండిజెనస్ టెక్నాలజీ క్రూయిజ్ మిస్సైల్ (ఐటీసీఎం) పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ పరీక్షను నిర్వహించారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణిని తయారు చేశారు. ఊహించినట్లుగానే ఇందులోని అన్ని ఉప వ్యవస్థలు సజావుగా పని చేశాయని కేంద్ర రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.