భువనేశ్వర్, సెప్టెంబర్ 27: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రెండు అతి స్వల్ప శ్రేణి క్షిపణులను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది.
భూ ఉపరితలం నుంచి గాలిలో తక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే ఈ క్షిపణులను ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మంగళవారం ప్రయోగించినట్టు డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. వీటిని డీఆర్డీవోకు చెందిన హైదరాబాద్లోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ), ఇతర డీఆర్డీవో ల్యాబ్లు కలిసి తయారు చేశాయని పేర్కొన్నది.