సొంతంగా అభివృద్ధి చేసిన డీఆర్డీవో
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: డీఆర్డీవో అభివృద్ధి చేసిన యాంటి డ్రోన్ వ్యవస్థను త్వరలోనే భారత త్రివిధ దళాల్లో ప్రవేశ పెట్టనున్నారు. యాంటిడ్రోన్ వ్యవస్థ కొనుగోలు కోసం ఆర్మీ, నౌకాదళం, వైమానిక దళం ఆగస్టు 31న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్)తో ఒప్పందం చేసుకొన్నాయి. డీఆర్డీవో అందించిన సాంకేతికతతో బెల్ యాంటిడ్రోన్ వ్యవస్థను తయారు చేసి సరఫరా చేస్తున్నది. ‘పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి సాయుధ బలగాల్లో ప్రవేశపెడుతున్న మొట్టమొదటి యాంటిడ్రోన్ వ్యవస్థ ఇదే’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జమ్ము ఎయిర్ బేస్లో డ్రోన్ దాడి, నియంత్రణ రేఖ వెంబడి అనుమానాస్పద డ్రోన్ల సంచారం నేపథ్యంలో యాంటిడ్రోన్ వ్యవస్థ అనివార్యంగా మారింది.