భువనేశ్వర్, నవంబర్ 10: రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఒడిశాకు వచ్చిన ద్రౌపది ముర్ము రెండు కిలోమీటర్లు నడిచి జగన్నాథుడిని దర్శించుకున్నారు. గురువారం పూరికి చేరుకున్న ఆమె తన కాన్వాయ్ను బాలాగండి ఛాక్ వద్ద నిలుపుదల చేశారు. అనంతరం సాధారణ భక్తురాలిగా రెండు కిలోమీటర్లు నడిచి జగన్నాథుడిని దర్శించుకున్నారు.