న్యూఢిల్లీ, జూలై 4(నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని స్టార్ దవాఖానకు చెందిన ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్, సజ్జా హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా ప్రతిష్ఠాత్మక డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ అవార్డు- 2022ను అందుకున్నారు.
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ సజ్జా ఈ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు ఫౌండేషన్ ఏపీ కమిటీ సభ్యుడు డాక్టర్ జీవీరావు మంగళవారం విలేకరులకు తెలిపారు. డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా వైద్య రంగంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగానే ఈ అవార్డు అందించినట్టు తెలిపారు.