సీడీఎస్ బిపిన్ రావత్ దుర్మరణంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. సీడీసీ రావత్, ఆయన భార్య, ఇతర సిబ్బంది దుర్మరణంపై కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సుప్రీం కోర్టు జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని సుబ్రహ్మణ్య స్వామి తన ట్వీట్లో డిమాండ్ చేశారు. తమిళనాడులోని కూనూర్ ప్రాంతంలో బుధవారం ఒక ఆర్మీ హెలికాప్టర్ కూలిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య, 12 మంది సైనిక అధికారులు చనిపోయారు.