చెన్నై, జూన్ 27: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పాల్గొననున్న సమావేశంలో నల్ల దుస్తులు ధరించకూడదని, సెల్ఫోన్లు తీసుకురావద్దని పెరియార్ యూనివర్సిటీ ఆదేశాలు జారీ చేసింది. సేలం జిల్లాలోని యూనివర్సిటీలో బుధవారం జరగనున్న ఓ కార్యక్రమానికి గవర్నర్ హాజరుకానున్నారు. తమిళనాడుకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ద్రవిడార్ విదుత్తలై ఖజగం సంస్థ నల్ల జెండాలతో నిరసనలు తెలుపుతామని ప్రకటించింది. దీంతో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసుల సూచనల మేరకు ఆదేశాలిచ్చినట్టు యూనివర్సిటీ ప్రతినిధులు చెప్పగా… యూనివర్సిటీ నిర్ణయంతో తమకు సంబంధం లేదని పోలీసులు తెలిపారు. పెరియార్ తిరస్కరించిన సనాతన వస్ర్తాలను ధరించొద్దని పోలీసులు గవర్నర్కు సూచించాలని సీపీఐ(ఎం) ఎంపీ వెంకటేశన్ తెలిపారు.