చెన్నై: డ్రవిడ పాలనపై తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై అధికార డీఎంకే మండిపడింది. బీజేపీ నేతలా మాట్లాడొద్దని గవర్నర్కు హితవు పలికింది. ‘విభజన రాజకీయాల గురించి మాట్లాడటం ద్వారా వర్ణాశ్రమ ధర్మం రోజులను తిరిగి తీసుకురావడానికి గవర్నర్ ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ప్రభుత్వాన్ని నియంత్రించాలని ప్రయత్నిస్తున్నారు’ అని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ఆరోపించారు.