లక్నో: డీజే మ్యూజిక్ ప్లే చేయడం, బ్యాండ్ వాయించడం సాధారణమే. అయితే ఇక్కడ మాత్రం అలాంటివి ఉంటే పెళ్లిళ్లు జరిపించొద్దని మత సంఘం సూచించింది. ముస్లింల వివాహ వేడుక అయిన నిఖాలో డీజే, బ్రాస్ బ్యాండ్ వాయించొద్దని ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ ముస్లిం మహాసభ స్పష్టం చేసింది. అలా వాయిస్తే నిఖా జరిపించొద్దని మత పెద్దలను కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సాధారణ పద్ధతిలోనే నిఖా చేసుకోవాలని, అందుకు మతపెద్దలు చొరవచూపాలని తెలిపింది.
భవిష్యత్తులో డీజే సంస్కృతిని ప్రోత్సహించమని ఆయా కుటుంబాల నుంచి లిఖితపూర్వక హామీ కూడా తీసుకోవాలని పేర్కొంది. వివాహాది శుభకార్యాలకు అధికంగా డబ్బు ఖర్చుచేయడాన్ని తాము ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటామని అందులో స్పష్టం చేసింది.
జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో ముస్లిం మతపెద్దలు పెండ్లి సమయంలో డ్యాన్స్, మ్యూజిక్, పటాకులు కాల్చడం వంటి వాటిపై నిషేధం విధించింది. ఇవన్నీ ఇస్లాం మతానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. దీనిని ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఘజియాబాద్ ముస్లి మహాసభ ఈ నిర్ణయం తీసుకున్నది.