కోల్కతా: శాంతినికేతన్లోని తన పూర్వీకుల ఆస్తి వివాదంలో ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్కు ఊరట లభించింది. బీర్బూమ్ జిల్లా కోర్టులో తదుపరి విచారణ జరిగే వరకు ఆ ఆస్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గురువారం కోల్కతా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 6 లోగా వివాదాస్పద స్థలంలోని ఇంటిని ఖాళీ చేయాలని విశ్వ భారతి కేంద్రియ విశ్వవిద్యాలయం అమర్త్యసేన్కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసుపై మే 15న విచారిస్తామని బీర్బూమ్ జిల్లా కోర్టు తెలపడంతో అమర్త్యసేన్ హైకోర్టును ఆశ్రయించారు.