TOMATO| లక్నో: దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాన్నంటుతుండటంతో వాటిని కొనాలంటేనే సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికీ టమాటాలు కిలో రూ.120కిపైనే ధర పలుకుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ మంత్రి ప్రతిభా శుక్లా ప్రజలకు ఉచిత సలహా ఇచ్చారు. టమాటాలు తినకండి.. ధరలు వాటంతట అవే దిగివస్తాయని పేర్కొన్నారు. అలాగే ప్రజలు ఇంటి వద్దే టమాటా మొక్కలు పెంచుకోవాలని సూచించారు. టమాటాలకు బదులు నిమ్మకాయలు వాడాలని, టమాటాలు ఎవరూ తినకంటే ధరలు అవే దిగివస్తాయని చెప్పారు.
ధరలు కట్టడికి చర్యలు తీసుకోకుండా, టమాటాలు తినకండి అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరలను నియంత్రించడం తమ చేతకాదని ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి వ్యాఖ్యలతో తేలిపోయిందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. గతంలో ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి. ధరల పెరుగుదలపై మంత్రి నిర్మలను మీడియా ప్రశ్నించగా.. తమ ఇంటిలో పెద్దగా ఉల్లిపాయలను ఉపయోగించమని మంత్రి సమాధానం ఇవ్వడం అప్పట్లో విమర్శల పాలయింది.