న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: గాజాలో శాంతి పునరుద్ధరణ కోసం డొనాల్డ్ ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఏర్పాటుచేయగా, ఇందులోని సగం దేశాలు యుద్ధం ముంగిట నిలువటం గమనార్హం. ఐక్యరాజ్యసమతి తరహాలో, యూఎన్కు ప్రత్యామ్నాయంగా చెబుతూ.. దాదాపు బిలియన్ డాలర్ (రూ.9 వేల కోట్లు)ఎంట్రీ ఫీజును ట్రంప్ నిర్ణయించారు.
అట్టహాసంగా ప్రారంభమైన ఈ శాంతి మండలిలో ఈజిప్టు, జోర్డాన్, ఖతార్, పాకిస్థాన్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు చేరిపోయాయి. మరికొన్ని దేశాలు సుముఖత వ్యక్తం చేశాయి. అయితే ఇరాన్ యుద్ధంతో ఇందులో సగం దేశాలు యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నట్టే! మరోవైపు తాలిబన్లతో తేల్చుకునేందుకు ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపిస్తున్నది.