న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం అడ్వైజరీ జారీ చేసింది. దివ్యాంగులను కించపరిచే మాటలను, పదాలను ఎట్టిపరిస్థితుల్లో వాడొద్దని.. వాటిని వాడితే వారిని అవమానించినట్టుగా భావించాల్సి వస్తుందని రాజకీయ నేతలను కోరింది.
గుడ్డోడు, కుంటోడు, పిచ్చోడు, చెవిటోడు, మతిలేనోడు, అవిటోడు లాంటి పదాలను ప్రసంగాల్లో వాడటం వల్ల దివ్యాంగుల మనస్సులు తీవ్రంగా బాధపడతాయని, దీనిని నివారించడానికి ఇలాంటి పదాలు వాడరాదని, ఇక ముందు వినియోగిస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.