న్యూఢిల్లీ: తనను తిట్టిన బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మకు ఢిల్లీ జల సంఘం అధికారి కౌంటర్ ఇచ్చారు. శుభ్రత కోసం రసాయనాలు చల్లిన యమునా నది నీటితో తల స్నానం చేశారు. ఛత్ పూజ సందర్భంగా భక్తులు నదిలో స్నానమాచరించడం సురక్షితమేనని నిరూపించారు. కాగా, ఛత్ పూజా ఏర్పాట్ల నేపథ్యంలో ఢిల్లీ జల్ బోర్డ్ (డీజేబీ) అధికారులు యమునా ఘాట్ను రసాయనాలతో శుభ్రం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ పశ్చిమ ఎంపీ పర్వేష్ వర్మ అక్కడకు చేరుకున్నారు. ఘాట్ను శుభ్రం చేయిస్తున్న అధికారులతో వాదనకు దిగారు.
ఎనిమిదేళ్ల వరకు యమునా నది శుభ్రం గురించి పట్టించుకోలేదని పర్వేష్ వర్మ ఆరోపించారు. ఇప్పుడు హడావుడిగా రసాయనాలు చల్లుతున్నారని విమర్శించారు. ‘ఈ నీటిలో మొదట మీరు మునగండి’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కెమికల్స్ను మీ తలపై పోయమంటారా? మీకు సిగ్గు లేదా? అంటూ వారిని దుర్భాషలాడారు. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, ఢిల్లీ జల సంఘం అధికారులను తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా, బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ విసిరిన చాలెంజ్ను ఢిల్లీ జల సంఘం (డీజేబీ) నాణ్యత నియంత్రణ అధికారి సంజయ్ శర్మ స్వీకరించారు. రసాయనాలతో శుభ్రం చేసిన యమునా నది నీటితో ఆయన స్నానం చేశారు. ఆ నీటిలో స్నానం చేయవచ్చని భక్తులకు భరోసా ఇచ్చారు.
డీజేబీ వైస్ చైర్మన్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. ఛత్ పండుగకు ముందు ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న పనిని అడ్డుకునేందుకు బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
DJB के अधिकारी संजय शर्मा से सांसद प्रवेश वर्मा ने बदतमीजी कर यमुना में स्नान की चुनौती दी थी।
संजय शर्मा जी ने यमुना के पानी से स्नान करके बताया कि यमुना जी का पानी स्नान के योग्य है।@p_sahibsingh को संजय शर्मा जी से सार्वजनिक रूप से माफ़ी मांगना चाहिए। pic.twitter.com/L9DtSXdlk5
— Durgesh Pathak (@ipathak25) October 30, 2022
आज सारी मीडिया के सामने दिल्ली सरकार DJB के डाइरेक्टरी क्वालिटी – संजय शर्मा ने यमुना जी के पानी से स्नान किया। बताया पानी नहाने के लिए बिल्कुल सुरक्षित।
छठी मैया की जय ! pic.twitter.com/mELDZ0fMbs
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) October 30, 2022