న్యూఢిల్లీ, జనవరి 19: దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హెపటైటిస్ ఏ టీకా హవిష్యూర్ను హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్) శుక్రవారం ఆవిష్కరించింది. ‘క్లినికల్ పరీక్షల్లో ఈ టీకా సురక్షితం, సమర్థవంతమైనదిగా నిరూపితమైంది’ అని ఐఐఎల్ ఎండీ ఆనంద్ కుమార్ తెలిపారు. ప్రముఖ బహుళజాతి సంస్థల టీకాలతో దీన్ని పోల్చి చూడొచ్చన్నారు. ఏడాదికి పైగా వయసున్నవారు హవిష్యూర్ మొదటి డోసును తీసుకోవచ్చు. మొదటి డోసు తీసుకొన్న ఆరు నెలల తర్వాత రెండో డో స్ తీసుకోవాలి. కలుషిత ఆహారం లేదా నీటి ద్వారా హెపటైటిస్ వ్యాపిస్తుంది.