ముంబై : అస్వస్థతతో చాలకాలంగా బాధపడుతూ హిందుజా దవాఖానలో కన్నుమూసిన బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ భౌతిక కాయానికి బుధవారం సాయంత్రం ముంబైలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. 98 ఏండ్ల వయసులో తుదిశ్వాస విడిచిన దిలీప్ కుమార్ తన సుదీర్ఘ సినీ ప్రస్ధానంలో కీలక మైలురాళ్లను అధిగమించి పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు.
పలువురు బాలీవుడ్ నటులు, దర్శక నిర్మాతలు దిలీప్ కుమార్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాలీవుడ్ ప్రముఖులు షారుక్ ఖాన్, రణబీర్ కపూర్, కరణ్ జోహార్, షబనా అజ్మీ, అనుపమ్ ఖేర్ తదితర సెలబ్రిటీలు దిలీప్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయన భార్య సైరాభానును పరామర్శించారు. ఇక శాంతాక్రజ్లోని జుహు మస్లిం స్మశాన వాటికలో అధికార లాంఛనాలతో దిలీప్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు.