న్యూఢిల్లీ: బాల్య వివాహ చట్టం-2006 అమలులో ఏర్పడుతున్న ఇబ్బందులు, సమర్థంగా అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఆరు వారాల్లోగా అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.
బాల్యవివాహ చట్టం అమలుపై ప్రకటించిన విధాన నిర్ణయాలు, దీని నిమిత్తం నియమించిన అధికారులకు ఇతర విధులేమన్నా అప్పగిస్తున్నారా? తదితర అంశాలపై రాష్ర్టాల నుంచి సేకరించిన సమాచారాన్ని తమకు అందించాలని ఏప్రిల్లో జరిగిన విచారణలో కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.