తాజాగా లీటరు పెట్రోల్పై 30 పైసలు,
డీజిల్పై 35 పైసలు పెంపు
న్యూఢిల్లీ: ముంబైలో లీటరు డీజిల్ ధర రూ.100 దాటింది. దీంతో దేశంలో డీజిల్ ధర రూ.100 దాటిన తొలి మెట్రో నగరంగా ముంబై నిలిచింది. శనివారం కూడా లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశంలో ఇంధన ధరలు రికార్డుస్థాయికి చేరాయి. ముంబైలో లీటరు డీజిల్ ధర రూ.100.29కి పెరుగగా.. ఢిల్లీలో రూ.92.47కి చేరింది. అలాగే లీటరు పెట్రోల్ ధర ముంబైలో రూ.109.83కు ఎగబాకగా.. ఢిల్లీలో రూ.103.84కు పెరిగింది. తాజాగా ఇంధన ధరలు పెరుగడం వరుసగా ఐదోరోజు.