కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తునిగా పేరొందిన సీనియర్ నేత, మాజీ మంత్రి మదన్ మిత్ర బుధవారం పార్టీలోని తన పదవులన్నింటికీ రాజీనామా చేసి, రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ రెబల్ వర్గంలో చేరారు. మున్సిపల్ నియామకాల కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మదన్ మిత్ర భార్య, ఇద్దరు కుమారులకు నమన్లు జారీ చేసిన మరుసటి రోజే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా మదన్ మిత్ర మాట్లాడుతూ పార్టీ పతనానికి మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీనే కారణమని విమర్శించారు. ‘పార్టీని కాపాడటం కంటే అభిషేక్ను కాపాడేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ అందరిది. కానీ ఇప్పుడు అది ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం అయ్యింది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.