న్యూఢిల్లీ: బరువు తగ్గేందుకు చక్కెరకు ప్రత్యామ్నాయంగా వినియోగించే నాన్ షుగర్ స్వీట్నర్స్ వాడకం వల్ల రోగాలు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
ఆస్పర్టమీ, నోటమీ, సచరిన్, స్టెవీయా, సుక్రలోజ్, సైక్లమేట్ తదితర నాన్ షుగర్ స్వీట్నర్లు కలిగిన ప్యాకేజ్డ్ ఆహారం తినడం వల్ల బరువు తగ్గకపోగా, టైప్-2 మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, మరణాలు సంభవిస్తాయని వెల్లడించింది. వీటికి బదులుగా పండ్లు ఆహారంగా తీసుకోవాలని సూచించింది.