న్యూఢిల్లీ, జూలై 12: మధుమేహులకు శుభవార్త. మధుమేహం నియంత్రణకు వాడే మాత్రల ధరలు భారీగా తగ్గనున్నాయి. త్వరలో సిటాగ్లిప్టిన్ మందు పేటెంట్ హక్కులు ముగియనున్నాయి. దీంతో అనేక కంపెనీలు ఈ మందును ఉపయోగించి మధుమేహాన్ని నియంత్రించేలా జెనెరిక్ మెడిసిన్ తయారుచేసేందుకు ముందుకొచ్చాయి.దాదాపు 50 కంపెనీలు వందకు పైగా బ్రాండ్లతో ఈ ఏడాది జూలై చివరికి లేదా ఆగస్టు నాటికి మార్కెట్లోకి రానున్నాయి. ఈ మందుల ధరలు తగ్గితే దేశంలోని 7.7 కోట్ల మంది డయాబెటిక్తో బాధపడుతున్న వారికి ఊరట లభించనున్నది.