న్యూఢిల్లీ, నవంబర్ 1: చిన్నపిల్లల ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా తక్కువగా ఉండటంతో క్షయ లక్షణాలు త్వరగా బయటపడవు. కానీ సాధారణమైన రక్తపరీక్ష లేదా ర్యాపిడ్ బ్లడ్ టెస్ట్లతో పిల్లల్లో క్షయను గుర్తించవచ్చునని, చికిత్స త్వరగా మొదలుపెట్టొచ్చని మ్యూనిచ్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. పిల్లల శ్వాసనాళాల నుంచి కఫం లేదా శ్లేష్మం శాంపిల్స్ను సేకరించటం కష్టతరంగా మారిందని, సరికొత్త క్షయ పరీక్ష పద్ధతుల్ని అత్యవసరంగా రూపొందించాలని మ్యూనిచ్ వర్సిటీ ప్రొఫెసర్ లారా ఒల్బ్రిచ్ చెప్పారు. భారత్ సహా ఐదు దేశాల్లో సైంటిస్టులు అధ్యయనం చేపట్టినట్టు ‘ద లాన్సెట్ జర్నల్’ వార్తా కథనం పేర్కొన్నది.