న్యూఢిల్లీ: ఇద్దరు మహిళలపై లైంగికదాడి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు మళ్లీ పెరోల్ లభించింది. కోర్టు ఈసారి మరో 21 రోజులపాటు పెరోల్ను మంజూరుచేసింది. గత ఏడాది అక్టోబర్లో, ఈ ఏడాది జనవరిలో అతడు 40 రోజులపాటు పెరోల్పై బయటకు రాగా, మరోమారు అతడికి పెరోల్ దక్కటం వివాదాస్పదమైంది.
పెరోల్పై అతడ్ని విడుదల చేయటం వెనుక హర్యానాలోని బీజేపీ సర్కార్ ప్రమేయముందన్న ఆరోపణలున్నాయి. సున్రాయి జైల్లో శిక్ష అనుభవించాల్సిన గుర్మీత్ సింగ్ పెరోల్పై పదే పదే బయటకు రావటం పరిపాటిగా మారింది.