కురుక్షేత్ర: హర్యానాలో ఇప్పుడు ఎలక్షన్ సీజన్. ఆ రాష్ట్రంలో అక్టోబర్ 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తున్నాయి. ఇక బీజేపీ కూడా తమ లిస్టును బయటపెట్టింది. అయితే మాజీ ఎమ్మెల్యే శశి రంజన్ పర్మార్కు ఆ లిస్టులో చోటు దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే శశి రంజన్ ఆవేదనకు గురయ్యారు. బివానీ లేదా తోషామ్ నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. జాబితాలో తన పేరు ఉంటుందని అనుకున్నానని ఆ మాజీ ఎమ్మెల్యే ఏడ్చేశారు. బాధను తట్టుకోలేక కన్నీళ్లు రాల్చారు. ఎంత మంది వారించినా.. ఆయన మాత్రం తన దుఖ్కాన్ని ఆపుకోలేకపోయారు. తన పేరును పరిశీలనలో ఉంచారని ప్రజలకు నమ్మచెప్పానని, కానీ ఇప్పుడు ఏం చేయాలని, నిస్సహాయుడిగా మారినట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలుబడనున్నాయి.
Shashi Ranjan Parmar, former BJP candidate from Tosham, broke down in tears after losing his ticket to Shruti Choudhry, Has called a meeting with his supporters on September 6 at Bhiwani. may contest as independent #HaryanaElections2024 #BJP #Tosham #ShashiRanjan #ShrutiChoudhry pic.twitter.com/VgQimmX4Of
— Sushil Manav (@sushilmanav) September 5, 2024