గోవా : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆశావాహులకు టికెట్లు దక్కకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గోవా డిప్యూటీ సీఎం చంద్రకాంత్ కావ్లేకర్ భార్య సావిత్రి కావ్లేకర్కు భారతీయ జనతా పార్టీ టికెట్ కేటాయించలేదు. దీంతో ఆమె బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు.
సావిత్రా కావ్లేకర్తో పాటు మాజీ మంత్రి దీపక్ పుష్కర్, డిప్యూటీ స్పీకర్ ఫెర్నాండెజ్ కూడా స్వతంత్ర బరిలోకి దిగనున్నారు. గోవా మాజీ సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్కు కూడా బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ నిన్న 34 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.