కోల్కతా : భారతీయ కరెన్సీపై మహాత్మాగాంధీ చిత్రాల తరహాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫొటోలను ముద్రించాలని కోరుతూ కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఎనిమిది వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. బెంగాల్కు చెందిన 84 సంవత్సరాల హరేంద్రనాథ్ బిస్వాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఇవ్వాల్సిన గౌరవం కేంద్ర ప్రభుత్వాలు ఇవ్వలేదని ఆరోపించారు. పిటిషన్పై విచారణ సందర్భంగా కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వైజే దస్తూర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఎనిమిది వారాల గడువు కోరగా.. అంగీకరించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 21వ తేదీకి వాయిదా వేసింది.