Punjab Elections | నవజ్యోత్ సింగ్ సిద్దూ.. ఇప్పుడు పంజాబ్ పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక వేళ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే కాంగ్రెస్ తరపునే కావాలి. కానీ… సిద్దూను ఆమ్ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రజలు చూడాలనుకుంటున్నారు. అవును. ఇది నిజమే.ఈ విషయాన్ని సీఎం కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది తాము ప్రజల నుంచే ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని, ఇందుకోసం ఫోన్ కాల్స్, వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా ప్రజలు సీఎం అభ్యర్థి పేరును సూచించాని సీఎం కేజ్రీవాల్ కోరారు. దీంతో 90 శాతం మంది భగంత్ మాన్ను సీఎం అభ్యర్థిగా సూచించారు. దీంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అయితే రెండో స్థానంలో సిద్దూ ఉన్నారు. ఆయన్ను కూడా ఆప్ ముఖ్యమంత్రిగా ప్రజలు చూడాలని భావిస్తున్నారు. సిద్దూకు అనుకూలంగా 3.6 శాతం ఓట్లు వచ్చాయి.
పంజాబ్ ఎన్నికల వేళ సీఎం కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మెరుగైన పంజాబ్ కోసం ప్రజలే తమ సీఎం అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు. ఇందుకు గాను ఓ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. అలాగే వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా కూడా ప్రజలు తమకు నచ్చిన నేత పేరును ప్రతిపాదించవచ్చని సూచించారు. అయితే మొదట కేజ్రీవాల్ ఎంపీ భగవంత్ మాన్ పేరును సూచించాలని భావించారు. కానీ.. ఆ తర్వాత ప్రజల నుంచే ఫీడ్బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మొత్తం 19 లక్షల మంది ఈ ఫీడ్బ్యాక్లో పాల్గొంటే 93 శాతం మంది భగవంత్ మాన్ పేరునే సూచించారు. దీంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ భగవంత్ మాన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు.