Bullet Injury | పంజాబ్ ఖరౌరీ సరిహద్దులో కాల్పుల్లో రైతు శుభకరణ్సింగ్ మృతికి సంబంధించిన ఘటనపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ జరిపించాలని కోరారు. రైతుల ఉద్యమానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో రెండు పిటిషన్లు విచారణలో ఉన్నాయి. తాజాగా రైతు మృతిపై కేసు నమోదైంది. ఈ నెల 29న పిటిషన్ను విచారణకు రానున్నది. న్యాయవాది హరీందర్ సింగ్ ఇషార్ కోర్టులో పిటిషన్ వేశారు. ఖనౌరీ సరిహద్దుల్లో బుల్లెట్ గాయంతో రైతు మృతి చెందాడని ఆయన ఆరోపించారు.
ఇది చాలా తీవ్రమైన విషయమని.. దీనిపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారించాలని కోరారు. ఇదిలా ఉండగా.. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు పంటలకు మద్దతు ధరతో పాటు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మళ్లీ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వగా.. పోలీసులు వారిరి పంజాబ్, హర్యానా బార్డర్లో అడ్డుకున్నారు. ఆయా ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ పంజాబ్, హరియాణా సరిహద్దులోని ఖనౌరీ వద్ద హింస చెలరేగింది. ఈ ఘటనలో 21 ఏళ్ల యువ రైతు శుభ కరణ్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. తలకి బులెట్ తగలడంతో మృతి చెందాడు. మరో ఇద్దరికి గాలయ్యాయి. దీనికి కారణం పోలీసులేనని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.