DELL | న్యూఢిల్లీ, మార్చి 18: ల్యాప్టాప్ బ్రాం డ్లలో ప్రసిద్ధిగాంచిన డెల్ సంస్థ తన ఉద్యోగులకు షాకిచ్చింది. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వర్క్ఫ్రమ్ హోమ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సంబంధించి గత నెలలో జారీ చేసిన మె మోలో పదోన్నతులకు సంబంధించి నూత న విధానాన్ని వెల్లడించింది.
ఇక నుంచి కార్యాలయంలో విధులు నిర్వహించని ఉ ద్యోగులు పదోన్నతుల్లో గానీ, కంపెనీలో ని తమ వర్క్ రోల్ను మార్చుకోవడానికి కా నీ అర్హులు కారంటూ స్పష్టం చేసింది. వారు రిమోట్ విధానంలోనే ఉండాలనుకుంటే అ లాగే కొనసాగవచ్చునని, వారికి ప్రమోష న్లు, జాబ్ రోల్ మార్పు ఉండదని పే ర్కొం ది. ఈ వివక్ష పై ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.