న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్నది. రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకే పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ భారీగా కొత్త కేసులు నమోదు కానున్నాయని, ఏకంగా 20 వేల మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ( Satyendar Jain ) వెల్లడించారు. పాజిటివిటీ రేటు కూడా 1 నుంచి 2 శాతం వరకు పెరుగవచ్చన్నారు.
అయితే, కరోనా థర్డ్ వేవ్కు తాము ఇప్పటికే సన్నద్ధమై ఉన్నామని సత్యేందర్ జైన్ చెప్పారు. ఆస్పత్రుల్లో కొవిడ్ కేర్ సెంటర్లను సిద్ధం చేశామన్నారు. కేసులు ఒక్కసారిగా పెరిగినా సరిపడేలా బెడ్లను సమకూర్చామని తెలిపారు. ప్రస్తుతం ఆస్రత్రుల్లో 10 శాతం కొవిడ్ బెడ్లు మాత్రమే వినియోగమయ్యాయని, ఇంకా 90 శాతం బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.