న్యూ ఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ శుక్రవారం ఆర్మీ కంటోన్మెంట్ను తలపించింది. యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవడంతో భారీగా పారా మిలటరీ బలగాలు మోహరించాయి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) ఢిల్లీ అధ్యక్షుడు అభిజ్ఞాన్, సెక్రెటరీ అంజలిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
సుమారు ఐదు గంటల పాటు నిర్బంధించారు. ఇంట్లోనే విద్యార్థి నేతలు ప్లకార్డులతో నిరసనను తెలిపారు. ‘జవాబుదారీతనం నుంచి మోదీని కాపాడేందుకు వర్సిటీని కంటోన్మెంట్గా మార్చేశారు’ అని అంజలి ట్వీట్ చేశారు. మోదీ పాల్గొనే సమావేశంలో విద్యార్థులు నల్ల దుస్తులు ధరించవద్దని యూనివర్సిటీ ఆదేశాలిచ్చింది.