న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్, కుతుబ్ మినార్ నీలి రంగు కాంతుల్లో తణుకులీనుతున్నాయి. రాష్ట్రపతి భవన్లోని నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లతోపాటు పక్కనే ఉన్న కుతుబ్ మినార్ దగదగ మెరిసిపోతున్నాయి. ప్రపంచ బాలల దినోత్సవాన్ని (వరల్డ్ చిల్డ్రన్స్ డే) పురస్కరించుకుని ఈ నీలి రంగు లైట్లను వేశారు. ప్రతి ఏటా నవంబర్ 19న ప్రపంచ బాలల దినోత్సవం జరుపుకుంటారు. అయితే, మన దేశంలో నవంబర్ 14న జాతీయ బాలల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం.