ఢిల్లీలోని కరెంట్ కోతలపై అక్కడి ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఢిల్లీ సర్కార్ ప్రకటించిన ఉచిత ల్యాప్ట్యాప్లు తమకు వద్దని, 24 గంటల విద్యుత్ సరఫరా ఉంటే అదే పదివేలంటూ పేర్కొంటున్నారు.
దేశంలో బొగ్గు కొరత కారణంగా ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయి. ఢిల్లీలోని కరెంట్ కోతలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్పై ఢిల్లీ సర్కార్ సాకులు చెబుతోంది. ఇళ్లల్లో విద్యుత్తే లేనప్పుడు, కనీసం 50 యూనిట్లు కూడా లేని సమయంలో ల్యాప్ట్యాప్ ఇస్తే మేం ఏం చేసుకోవాలి? మమ్మల్ని ఇబ్బందులు పెట్టినట్లే అంటూ ఒకరు పేర్కొన్నారు.
మరో వ్యక్తి స్పందిస్తూ.. మాకేమీ ఉచితంగా ల్యాప్ట్యాప్ వదదు. మా దగ్గర నుంచి బిల్లులు వసూలు చేస్తున్నారు కదా.. 24 గంటల విద్యుత్ ఇవ్వండి. ఢిల్లీ మోడల్ ఢిల్లీ మోడల్ అంటూ కేజ్రీవాల్ తెగ ప్రచారాలు చేస్తున్నారు. కరెంట్ కోతల వల్ల మా తలప్రాణం తోకకు వస్తోంది అంటూ మండిపడ్డారు.