న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు సోమవారం మరోసారి సమన్లు జారీచేసింది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్.. జాక్వెలిన్కు దేశ, విదేశాల్లో విలువైన కానుకలు ఇచ్చారనే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో విచారించేందుకు ఢిల్లీలోని ఈవోడబ్ల్యూ కార్యాలయానికి బుధవారం హాజరుకావాలని పోలీసులు నోటీసులో సూచించారు. జాక్వెలిన్కు పోలీసులు సమన్లు జారీచేయడం ఇది మూడోసారి. కాగా, గత ఏడాది ఆగస్టు 30, అక్టోబర్ 20 తేదీల్లో జాక్వెలిన్ వాంగ్మూలాన్ని ఈడీ రికార్డు చేసింది.