న్యూఢిల్లీ: సింగర్, కాంగ్రెస్ పార్టీ నేత సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) హంతకుడు అంకిత్ సిర్సాను పోలీసులు అరెస్టు చేశారు. సిర్సాతోపాటు లారెన్స్ బిష్ణోయ్-గోల్డీ బ్రార్ గ్యాంగ్కు చెందిన మరో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను దుండగులు మే 29న కారులో వెంబడించి కాల్చిన చంపిన విషయం తెలిసిందే. సిద్ధూని కాల్చినవారిలో అంకిత్ కూడా ఒకడని పోలీసులు వెల్లడించారు. అతడు రాజస్థాన్లో జరిగిన రెండు హత్యల్లో కూడా ప్రధాన నిందితుడుగా ఉన్నాడని తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో మరో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసిశారు.
మే 29న మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలను తుపాకీతో కాల్చిచంపారు.. ఈ కాల్పుల్లో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆయనపై 20 రౌండ్లకుపైగా కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ ప్రభుత్వం వీఐపీ సంస్కృతికి తెర దించుతూ రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన భద్రతను ఉపసంహరించింది. ఆ మరుసటి రోజే ఈ ఘటన జరిగింది.