న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నియంత్రణకు ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. పీయూసీ (pollution under control) సర్టిఫికెట్ లేకుండా బంకుల్లో పెట్రోల్, డీజిల్ను పోయరని స్పష్టం చేసింది. ఈ నెల 25 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్రాయ్ శనివారం తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 29న పర్యావరణం, రవాణా, ట్రాఫిక్ అధికారులు సమావేశమై.. ప్రణాళిక, విధివిధానాలపై చర్చించేందుకు నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.
వాహనాల నుంచి వచ్చే ఉద్గారాల ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి కారణాలనీ, వాటిని తగ్గించేందుకు గాను అక్టోబర్ 25 నుంచి పీయూసీ సర్టిఫికెట్ లేకుండా బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయకూడదని నిర్ణయించినట్లు మంత్రి ఢిల్లీలో విలేకరుల సమావేశంలో తెలిపారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) అమలును నిర్ధారించేందుకు ఈ నెల 3 నుంచి ఢిల్లీలో 24/7 వార్ రూమ్ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీంతోపాటు ఈ నెల 6 నుంచి యాంటీ డస్ట్ క్యాంపెయిన్ను ప్రారంభించనున్నట్లు చెప్పిన గోపాల్ రాయ్.. అక్కడ నిర్మాణ స్థలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కాలుష్యాన్ని అరికట్టనున్నట్లు వివరించారు.