న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీపై పెత్తనం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ వంటివి మిగతా రాష్ట్రాల్లో కూడా కేంద్రం తీసుకువస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) హెచ్చరించారు. కేంద్రం తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆదివారం ఏర్పాటు చేసిన మహా ర్యాలీలో ఆయన మాట్లాడారు. కేంద్రం తొలుత ఢిల్లీపై దాడి చేసిందని తెలిపారు. ఆ తర్వాత ఇలాంటి ప్రత్యేక ఆర్డినెన్స్లను మిగతా రాష్ట్రాల్లో కూడా తీసుకువస్తుందని అన్నారు. కేంద్రం ఆర్డినెన్స్ ఢిల్లీ ప్రజలను అవమానించడమేనని విమర్శించారు. ఈ ఆర్డినెన్స్ వల్ల ఢిల్లీలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోతుందని ఆరోపించారు. ‘ఢిల్లీలో నియంతృత్వం ఉంటుంది. ఎల్జీనే (లెఫ్టినెంట్ గవర్నర్) సుప్రీం. ప్రజలు ఎవరికి కావాలంటే వారికి ఓటు వేయవచ్చు. కానీ ఢిల్లీని మాత్రం కేంద్రమే నడిపిస్తుంది’ అని దుయ్యబట్టారు.
కాగా, ప్రధాని మోదీతోపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. కేంద్రం ఆర్డినెన్స్ ‘హిట్లరిజం, నియంతృత్వం’ అని ఆరోపించారు. ‘సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాను అంగీకరించబోనని ప్రధాని మోదీ చెబితే దాన్ని హిట్లరిజం అంటారు. మోడీ జీ బ్లాక్ ఆర్డినెన్స్ చెబుతోంది.. ‘నాకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు, ఇప్పుడు ఢిల్లీలో నియంతృత్వం నడుస్తుందని. ప్రజలు సుప్రీం కాదు, ఎల్జీనే సుప్రీం’ అని విమర్శించారు.
మరోవైపు ప్రధాని మోదీ దేశ రాజ్యాంగాన్ని మార్చారని, ఆర్డినెన్స్ ద్వారా ఢిల్లీ ప్రజలను అవమానించారని కేజ్రీవాల్ విమర్శించారు. గత 75 ఏళ్లలో ఇంత అహంకారపూరితమైన ప్రధానిని తాను చూడలేదని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను పాటించనని మోదీ చెబుతున్నారని, నియంతృత్వం అంటే ఇదేనని దుయ్యబట్టారు. ఇలాంటి ఆర్డినెన్స్లను మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా కేంద్రం తెస్తుందని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఈ ధోరణిని ఇక్కడే అంతం చేయాలని, నియంతృత్వానికి ముగింపు పలికే ఉద్యమం ఢిల్లీ నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు.
जब PM Modi कहते हैं कि मैं Supreme Court के फैसले को नहीं मानता तो इसे ही Hitlerशाही कहते हैं।
मोदी जी का काला अध्यादेश कहता है-
मैं जनतंत्र को नहीं मानता, अब दिल्ली के अंदर तानाशाही चलेगी।अब जनता Supreme नहीं, LG सुप्रीम है।
– CM @ArvindKejriwal #AAPKiMahaRally pic.twitter.com/FDX2o49VzY
— AAP (@AamAadmiParty) June 11, 2023
मैं सभी राजनीतिक पार्टियों से मिला हूँ।
आप ये मत समझना कि आप अकेले हो, आपके साथ देश के 140 Crore लोग हैं।
Tamil Nadu, Telangana, Maharashtra, UP, Bihar, Punjab सभी राज्यों के लोग आपके साथ हैं।
ये मोदी जी का पहला वार है, अगर दिल्ली के लोगों के अधिकार छीनने वाले इस अध्यादेश को… pic.twitter.com/vDj8SKXSG5
— AAP (@AamAadmiParty) June 11, 2023