న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ చూడటంలో పూర్తిగా బిజీ అయిన ఒక వ్యక్తి మెట్రో రైల్ పట్టాలపై పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఈశాన్య ఢిల్లీలోని షాహదారా ప్రాంతానికి చెందిన 58 ఏండ్ల శైలేందర్ మెహతా శుక్రవారం మరో చోటకు వెళ్లేందుకు షాహదారా మెట్రో స్టేషన్కు వచ్చాడు. అయితే ఫ్లాట్ఫారం చివరన నడుతున్న అతడు ఫోన్ చూడటంలో బిజీ అయ్యాడు. దీంతో గమనించకుండా ఫ్లాట్ఫారం అంచుకు వెళ్లి కింద ఉన్న రైలు పట్టాలపై పడ్డాడు.
మరోవైపు మెట్రో రైలు స్టేషన్లోకి వస్తున్నది. అయితే ఫోన్లో బిజీగా ఉండి పట్టాలపై పడిన శైలేందర్ మెహతా పైకి లేవలేకపోయాడు. గమనించిన సీఐఎస్ఎఫ్కు చెందిన కానిస్టేబుల్ రోతాష్ చంద్ర వెంటనే అతడి వద్దకు చేరుకున్నారు. శైలేందర్ను ఫ్లాట్ఫారంపైకి చేర్చడంలో సహకరించారు. అనంతరం మెట్రో రైలు స్టేషన్లోకి వచ్చింది.
ఆ మెట్రో రైల్ స్టేషన్లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియోను సీఐఎస్ఎఫ్ తన ట్విట్టర్లో షేర్ చేసింది. మెట్రో రైలు పట్టాలపై పడిన ఆ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపింది. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫోన్లో బిజీగా ఉంటూ మెట్రో రైలు పట్టాలపై పడిన వ్యక్తిని కాపాడిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చంద్రను నెటిజన్లు ప్రశంసించారు.
A passenger namely Mr. Shailender Mehata, R/O Shadhara, slipped and fell down on the metro track @ Shahdara Metro Station, Delhi. Alert CISF personnel promptly acted and helped him out. #PROTECTIONandSECURITY #SavingLives@PMOIndia @HMOIndia @MoHUA_India pic.twitter.com/Rx2fkwe3Lh
— CISF (@CISFHQrs) February 5, 2022