న్యూఢిల్లీ: ప్రియురాలి భర్తను హత్య చేసిన ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మునీషద్దీన్, రషీద్ అనే ఇద్దరు పంబ్లింగ్, ఎలక్ట్రీషియన్గా పని చేసేవారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. దీంతో ఒకరి ఇంటికి మరొకరు వెళ్లేవారు. ఈ నేపథ్యంలో రషీద్ భార్యతో మునీషద్దీన్కు వివాహేతర సంబంధం ఏర్పడింది.
కాగా, తన భర్త అడ్డు తొలగించాలని గత పది రోజులుగా మునీషద్దీన్ను రషీద్ భార్య ఒత్తిడి చేసింది. దీంతో జనవరి 2న వజీరాబాద్ పరిధిలోని రామ్ ఘాట్కు రషీద్ను మునీషద్దీన్ తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరూ మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న రషీద్ను కత్తితో పొడిచి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తగులబెట్టాడు.
మరోవైపు కాలిన మృతదేహం గురించి స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడు మునీషద్దీన్ను గుర్తించారు. తెల్లవారుజామున రోహిణి సెక్టార్లోని ఒక ప్రాంతానికి అతడు వస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ట్రాప్ చేసి నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.