Sanjay Singh | ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన రాజ్యసభ సభ్యుడిని నవంబర్ 10వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మద్యం పాలసీ కేసులో అక్టోబర్ 4న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ ఆయనను శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ సింగ్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. అలాగే కుటుంబ ఖర్చులతో పాటు పార్లమెంట్ సభ్యుడిగా చేసిన పనుల కోసం కొన్ని చెక్కులపై సంతకం చేసేందుకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. అలాగే సంజయ్ సింగ్కు ప్రైవేట్ వైద్యుడితో సహా సరైన చికిత్స అందించాలని సంబంధిత జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.