హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా రెండో వేవ్ విలయం సృష్టించింది. వైరస్ బారినపడి సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు, అధికారులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా విధులు నిర్వర్తిస్తున్న ఏకే రక్షిత్ కొవిడ్ మహమ్మారికి బలయ్యారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన ఢిల్లీ ద్వారక ప్రాంతంలోని ఆకాశ్ దవాఖానలో చికిత్స నిమిత్తం చేశారు. పరిస్థితి విషమించి ఈ సాయంత్రం ప్రాణాలు కోల్పోయారు. ఏకే రక్షిత్ మృతిపట్ల పలువురు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఢిల్లీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 946 కొవిడ్ పాజిటవ్ కేసులు నమోదయ్యాయి. 78 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.